గులాబీ తోటలో గంజాయి మొక్కలున్నాయి

గులాబీ తోటలో గంజాయి మొక్కలున్నాయి

బెంగళూరు డ్రగ్స్ కేసులో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రమేయం ఉందనే అంశంపై తీవ్రంగా స్పందించారు తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. గులాబీ తోటలో గంజాయి మొక్కలు పెంచుతున్న పరిస్థితి కనబడుతోందన్నారు. డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు బయటకు వస్తుంటే ఎందుకు ఎవరూ మాట్లాడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయని... ఈ విషయంపై విచారణ జరిపించాలని కోరారు. గతంలో సినీ నటులపై పెద్ద ఎత్తున దాడులు చేసి తర్వాత డ్రగ్స్ కేసును పోలీసులు దాదాపు మూసివేశారని... ఇప్పుడైనా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు దాసోజు శ్రవణ్.