ఆన్ లైన్ యాప్‌ల ఆగడాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేయాలి

 ఆన్ లైన్  యాప్‌ల ఆగడాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేయాలి

ఆన్‌లైన్ లోన్ యాప్‌లను రద్దు చేయాలంటూ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. ఆన్‌లైన్ లోన్ యాప్‌ మాఫియా దుర్మార్గాలను ఆధారాలతో లేఖలో వివరించారు. ఆన్‌లైన్ లోన్ యాప్‌ మాఫియా కారణంగా అనేక మంది అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని..ప్రతినిత్యం ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఫిర్యాదులు వస్తున్నా.. పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. పోలీసు శాఖలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి అక్రమ ఆన్‌లైన్ లోన్ యాప్‌లను అణిచివేయాలని డిమాండ్ చేశారు.

ఆన్లోన్ యాప్‌ల చట్టవిరుద్ధ చర్యలను నిరోధించడానికి బలమైన సైబర్ సెక్యూరిటీ ఫైర్‌వాల్‌లను ఏర్పాటు చేయాలని లేఖలు పేర్కొన్నారు దాసోజు శ్రవణ్. సమస్యను పరిష్కరించడానికి టోల్ ఫ్రీ నంబర్, ఈమెయిల్ ఐడీతో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఎన్బీఎఫ్సీ రిజిస్ట్రేషన్,  ఆర్బీఐ ఆమోదం ఉన్న యాప్‌లకే అనుమతి ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వ , ప్రైవేట్ రంగ బ్యాంకులు చిన్న, మధ్యతరహా, పేదవర్గాలకు  రుణాలు ఇచ్చేలా పాలసీ తేవాలని దాసోజు శ్రవణ్ సూచించారు.