గూడూరు గ్రామంలో దత్తాత్రేయస్వామి, సాయిబాబా విగ్రహాల ప్రతిష్ఠ

గూడూరు గ్రామంలో దత్తాత్రేయస్వామి, సాయిబాబా విగ్రహాల ప్రతిష్ఠ

శివ్వంపేట, వెలుగు: గూడూరు గ్రామంలో దత్తాత్రేయ స్వామి, సాయిబాబా విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవం బుధవారం రెండో రోజు శ్రీ గురు పీఠం చైర్మన్, ఆలయాల వ్యవస్థాపకుడు శివకుమార్ గౌడ్, వేద పండితుడు వామన శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్​రావు, నర్సాపూర్​ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డీసీ మాజీ  చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి హాజరై, పూజలు చేశారు. అనంతరం హరీశ్​రావు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో శివ్వంపేట, గూడూరు గ్రామాలు పెద్ద పుణ్యక్షేత్రాలుగా మారుతాయన్నారు.

 దత్తాత్రేయస్వామి, సాయిబాబా ఆలయాలను శివకుమార్ గౌడ్ నిర్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణ గౌడ్, మాజీ ఎంపీపీ హరికృష్ణ, మాజీ జడ్పీటీసీ మహేశ్ గుప్తా, జడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యుడు మన్సూర్ అలీ,  నర్సాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్ గౌడ్ తదితరులున్నారు.