
హైదరాబాద్/పద్మారావునగర్/కంటోన్మెంట్/ఘట్ కేసర్/వికారాబాద్, వెలుగు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని శనివారం గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో వివిధ కేడర్లలో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులను సూపరింటెండెంట్ డా. బి. నాగేందర్ సత్కరించారు. సీఎస్ అడ్మిన్ ఆర్ఎంవో డా. బి.శేషాద్రి, సీనియర్, జూనియర్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. పద్మారావునగర్ హమాలీబస్తీ ప్రభుత్వ స్కూల్లో దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలు పోటీలు నిర్వహించి స్టూడెంట్లకు ప్రైజ్లు అందజేశారు.
బోయిన్పల్లిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంట లెక్చువల్ డిజబిలిటీ(నిపిడ్) ఆధ్వర్యంలో దివ్యాంగులైన పిల్లలకు కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించారు. చిన్నారుల ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో నిపిడ్ డైరెక్టర్ బీవీ రామ్ కుమార్, డాక్టర్ దశరథ్, డాక్టర్ శిల్ప, డాక్టర్ గణేశ్, స్టూడెంట్లు పాల్గొన్నారు. ఈసీఐఎల్ గ్రౌండ్లో ఏవైజేఎన్ ఎస్హెచ్డీ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ రిహాబిలిటేషన్ కామన్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో ఎన్ఐఈపీఐడీ(నిపిడ్) టీమ్ కప్ గెలుచుకోగా.. ఎన్ఐహెచ్హెచ్ రన్నరప్గా నిలిచింది. ఘట్కేసర్లోని నైబర్ వుడ్ సెంటర్లో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి దివ్యాంగులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం వారికి ఆటల పోటీలు, క్విజ్ నిర్వహించారు. విజేతలకు ప్రైజ్లు అందించారు. ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆశ్రయ్ ఆకృతి ఎన్జీవో ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.