సెకెండ్ సీజన్ కోసం ఎదురు చూస్తారు

సెకెండ్ సీజన్ కోసం ఎదురు చూస్తారు

జేడీ చక్రవర్తి, రమ్య నంబీశన్,  ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో పవన్ సాధినేని రూపొందించిన వెబ్ సిరీస్ ‘దయా’.  ఎస్వీఎఫ్ ఎంటర్‌‌‌‌టైన్మెంట్ సంస్థ నిర్మించింది.  ఆగస్టు 4 నుంచి డిస్నీ ప్లస్‌‌ హాట్‌‌ స్టార్‌‌‌‌లో  స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రీసెంట్‌‌గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ ‘ఈ వెబ్ సిరీస్‌‌లోని ప్రతి ఎపిసోడ్  ప్రశ్నలతో ముగుస్తుంది. ఈ ప్రశ్నలన్నీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయవు.. ఇంట్రెస్ట్ కలిగిస్తాయి.

దయా కథ ఒక సీజన్‌‌తో ఆగదు, సెకెండ్ సీజన్ కోసం మీరు  వెయిట్ చేస్తూనే ఉంటారు’ అని చెప్పాడు. మేమొక సూపర్ వెబ్ సిరీస్ చేశామంది ఈషా రెబ్బా. పవన్ మాట్లాడుతూ ‘ఇది అప్ కమింగ్ యాక్టర్స్‌‌కు ఒక గైడ్ లాంటి వెబ్ సిరీస్. కొత్త ఆర్టిస్టులు వీళ్ల పెర్ఫార్మెన్సులు పాఠంలా నేర్చుకోవచ్చు’ అని చెప్పాడు.  నటులు కమల్ కామరాజు,  జోష్ రవి, గాయత్రి గుప్తా,  సినిమాటోగ్రాఫర్ వివేక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.