మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాపాలన : కొమ్మూరి ప్రతాపరెడ్డి

మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాపాలన :  కొమ్మూరి ప్రతాపరెడ్డి
  • జనగామ డీసీసీ అధ్యక్షుడు  కొమ్మూరి ప్రతాపరెడ్డి

చేర్యాల, వెలుగు: రాష్ట్రంలోని మహిళల అభివృద్ధే లక్ష్యంగా సీఎం రేవంత్​ రెడ్డి ప్రజా పాలన కొనసాగుతుందని జనగామ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు.  బుధవారం మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయితీ భవన నిర్మాణం, మహిళా భవన్​ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సాయపల్లి అభివృద్ధే  లక్ష్యంగా నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు.  గ్రామ మహిళలు అడిగిందే తడవుగా తనకున్న 140 గజాల స్వస్థలాన్ని మహిళా భవనం కోసం ఇచ్చారు.  కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం మల్లేశం,  కె. జీవన్​రెడ్డి, జె. సుదర్శన్​రెడ్డి, యం. మనోహర్​, బాలనర్సయ్య, శ్రీధర్​రెడ్డి, మంజ మల్లేశం, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.