డీసీసీబీలో డబ్బులు కాజేసిన నిందితుడి అరెస్టు

డీసీసీబీలో డబ్బులు కాజేసిన నిందితుడి అరెస్టు

ఆదిలాబాద్, వెలుగు: డీసీసీబీలో రూ. 2.85 కోట్లు కొట్టేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్​ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ ​డిస్ట్రిక్ట్ ​సెంట్రల్​ కోఆపరేటివ్ ​బ్యాంకు(ఏడీసీసీబీ) స్టాఫ్​ అసిస్టెంట్​గా శ్రీపత్​కుమార్​ పని చేస్తున్నాడు. ఆన్​లైన్​ బెట్టింగ్​కు అలవాటు పడిన శ్రీపత్​కుమార్​ ​డోప్టాల పీఏసీఎస్, బేల పీఏసీఎస్ పేరు మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశాడు. ఎలాంటి వోచర్, బ్యాంకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ల పర్మిషన్​ లేకుండానే వారి పాస్​వర్డ్ ​వాడుకొని భార్య, బావ, మరదలు, అత్త అకౌంట్లలోకి రూ. 2.85 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ నగదును మళ్లీ ఫ్రెండ్స్​ అకౌంట్లలోకి బదిలీ చేశాడు. లెక్కల్లో రూ. 2.85 కోట్లు తేడా రావడంతో బేల అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు శ్రీపత్ కుమార్ ను అరెస్టు చేశారు. రూ. 98 లక్షలు రికవరీ చేశారు. రూ. 1.40 కోట్లు ఆన్​లైన్​బెట్టింగ్​లో పోగొట్టినట్లు తేల్చారు.