
- విరిగిన ఎస్ఐ కాలు
కూకట్పల్లి, వెలుగు: హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగి ఒకరు చనిపోగా.. ఆ కేసు పంచనామా నిర్వహిస్తున్న ఎస్ఐని డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఎస్ఐ ఎడమ కాలు విరిగిపోయింది. వెంటనే అతన్ని ఓ ప్రైవేట్హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి బాలానగర్నుంచి కూకట్పల్లి వైపు ఫ్లైఓవర్పై నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ఆ టైంలో బోయిన్పల్లి నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న ప్రొబెషనరీ ఎస్ఐ వెంకటేశం ఘటనా స్థలానికి చేరుకున్నాడు. 3.10 గంటల టైంలో పంచనామా చేసి డెడ్బాడీని 108 వాహనంలో ఎక్కిస్తున్నారు. అదే టైంలో కూకట్పల్లి వైపు వస్తున్న డీసీఎం వేగంగా ఎస్ఐని ఢీకొట్టింది.
దీంతో ఎస్ఐ ఎడమ కాలు విరిగిపోయింది. దీంతో అతడిని వెంటనే ఓ ప్రైవేట్దవాఖానకు తరలించారు. తెల్లవారుజామున జరిగిన ప్రమాదానికి సంబంధించిన కారు డ్రైవర్, ఎస్ఐని ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్ఇద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు. కేసు నమోదు చేసుకుని బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.