గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌ సిటీలో డీసీపీలు చార్జ్‌‌

గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌ సిటీలో డీసీపీలు చార్జ్‌‌

హైదరాబాద్‌‌,వెలుగు :  గ్రేటర్‌‌‌‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో ట్రాన్స్‌‌ఫర్స్, పోస్టింగ్‌‌ పొందిన డీసీపీలు శనివారం చార్జ్‌‌ తీసుకున్నారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీగా కొత్తపల్లి నరసింహ, మేడ్చల్, బాలానగర్ ఎస్‌‌ఓటీ డీసీపీగా ధన్నారపు శ్రీనివాస్, సైబర్ క్రైమ్స్‌‌ డీసీపీగా శిల్పవల్లి, రాజేంద్రనగర్ డీసీపీగా శ్రీనివాస్, సైబరాబాద్ విమెన్ సేఫ్టీ డీసీపీగా సృజన కర్ణం బాధ్యతలు స్వీకరించారు. 

రాచకొండ కమిషనరేట్‌‌ పరిధిలోని మల్కాజిగిరి డీసీపీగా పీవీ పద్మజ, ఎల్​బీనగర్‌‌‌‌ డీసీపీగా ప్రవీణ్‌‌కుమార్, మహేశ్వరం డీసీపీగా సునీతారెడ్డి చార్జ్ తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది ఐపీఎస్‌‌లు,21 మంది నాన్‌‌ కేడర్‌‌‌‌ ఎస్పీలను బుధవారం బదిలీ చేసినది తెలిసిందే.