దారుణం.. ప్రేమ జంటను చంపి చెట్టుకు వేలాడదీసి..

దారుణం.. ప్రేమ జంటను చంపి చెట్టుకు వేలాడదీసి..

యూపీలో  ఓ ప్రేమ జంటను దారుణంగా హత్య చేసి మృతదేహాలను చెట్టుకు వ్రేలాడదీశారు. బరేలీ మీర్ గంజ్ లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. దారుణంగా కొట్టి చంపి మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు.  మీర్ గంజ్ లోని అంబర్ పూర్ గ్రామంలోని బీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న దివ్యానంద్ గ్యాంగ్ వర్ అనే యువకుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కిషోరి అనే యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం మధ్యాహ్నం పొలం దగ్గర ఏకాంతంగా మాట్లాడుకుంటుండగా.. బాలిక మేనమామ చూశారు. దీంతో ఆగ్రహానికి లోనైన వారు  మరో ఇద్దరితో కలిసి  ప్రేమ జంటను తీవ్రంగా కొట్టి చంపారు. తర్వాత మృతదేహాలను చెట్టుకి వేలాడదీశారు. ఈ ఘటన యువకుడి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మేనమామ, ఆమె సోదరుడిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు పోలీసులు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు.