ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని హత్య వెనక కారణం అదేనా?.. సంచలన విషయాలు వెలుగులోకి

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని హత్య వెనక కారణం అదేనా?.. సంచలన విషయాలు వెలుగులోకి

19యేళ్ల మెహక్ జైన్..ఆమె పుట్టినరోజుకు కొన్ని రోజులు ముందు ఢిల్లీలో హత్యకు గురైంది. ఆమె ప్రియుడు అర్ష్ కృత్ సింగ్ చేతి దారుణంగా చంపబడింది. కాలేజీకి వెళ్తున్న ఆమెను వెంటాడి వేధించాడు. ఫేక్ సోషల్ మీడియాలో అకౌంట్లు సృష్టించి ఆమె ఫాలో అయ్యాడు. చివరికి ఓ పార్కులో దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు.. ప్రేమించిన మెహక్ జైన్ ను అర్ష్ కృత్ సింగ్ ఎందుకు చంపాల్సి వచ్చింది.. కారణం అదేనా?..

ఢిల్లీకి చెందిన మెహక్ జైన్..మంగళవారం ఢిల్లీలోని లజపత్ నగర్ ప్రాంతంలో ఓపార్కులో దారుణంగా హత్యకు గురైంది. ఇంగ్లీషులో బీఏ హానర్స్ చదువుతున్న జైన్.. ట్రాన్స్ లేటర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది..అందుకోసం ఢిల్లీ యూనివర్సిటీలో కొరియన్ కోర్సులో చేరింది. జైన్ తల్లి ప్రైవట్ ట్యూటర్ కాగా.. తండ్రి బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఉద్యోగం సంపాదించిన కుటుంబానికి సాయం చేయాలనుకు జైన్.. అనుకోకుండా మంగళవారం తన పుట్టిన రోజుకు నాలుగు రోజుల ముందు దారుణంగా హత్యకు గురైంది. 

నిందితుడు అర్ష్ కృత్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ లో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గతేడాది స్కూల్ వీడ్కోలు సమావేశంలో కలుసుకున్న జైన్ , అర్ష్ కృత్ సింగ్ మధ్య ప్రేమ సాగుతోంది.  ఆ విషయం జైన్ కుటుంబానికి కూడా తెలిపారు. అయితే జైన్ తరుచుగా ఇద్దరు అబ్బాయిలతో చనువుగా ఉంటుందని.. వెంటనే మానుకోవాలని సింగ్.. జైన్ ను వార్నింగ్ ఇచ్చాడు. అయిను జైన్ పై అనుమానం ఉన్న సింగ్.. ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసి ఆమెను ఫాలో అవుతూ వచ్చాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. 

ఈ క్రమంలో మంగళవారం ఢిల్లీలోని లజపత్ నగర్ లోని ఓ పార్కులో జైన్ను సింగ్ దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. హత్య జరిగిన రోజు పార్కులో ఇతర అబ్బాయిల గురించి వాగ్వాదం జరిగింది. పథకం ప్రకారం..కూల్ డ్రింక్ లో పెట్రోల్ కలిపి తాగించి పైశాచిక ఆనందం పొందిన సింగ్.. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి హత్య చేశాడు. సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు దశలో ఉంది.