డియర్ స్టూడెంట్స్ చిత్రం మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

డియర్ స్టూడెంట్స్ చిత్రం మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

హీరోయిన్‌‌‌‌గా ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు దాటినా ఇప్పటికీ అదే గ్లామర్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నయనతార. స్టార్ హీరోలకు జంటగా నటిస్తూనే, మరోవైపు ఫిమేల్‌‌‌‌ లీడ్‌‌‌‌గానూ వరుస చిత్రాలు చేస్తోంది. తాజాగా ఆమె మరో చిత్రంలో ఆన్ బోర్డ్ అయినట్టు ఆదివారం అనౌన్స్ చేశారు. మలయాళ నటుడు నివిన్ పౌలీ హీరోగా చేస్తున్న ‘డియర్ స్టూడెంట్స్’ చిత్రంలో నయనతార  నటిస్తుందని మోషన్ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో ప్రకటించారు. 

క్లాస్ రూమ్‌‌‌‌ను చూపిస్తూ, అందులో కొన్ని పేపర్స్ ఎగురుతుండగా, చేత్తో పెన్నును తిప్పుతున్నట్టుగా కనిపిస్తున్న నయన్ ఇందులో టీచర్‌‌గా నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె నటించడం సూపర్ ఎక్సయిటింగ్‌‌‌‌గా ఉందని చెబుతూ, త్వరలోనే షూటింగ్‌‌‌‌ను మొదలుపెట్టనున్నట్టు నివిన్ పౌలీ సోషల్ మీడియాలో పోస్ట్‌‌‌‌ చేశాడు.   జార్జ్‌‌‌‌ పిలిప్ రాయ్‌‌‌‌, సందీప్‌‌‌‌ కుమార్‌‌‌‌ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని  నివిన్ పౌలీ హోం బ్యానర్‌‌‌‌ పౌలీ జేఆర్ పిక్చర్స్‌‌‌‌ బ్యానర్‌‌‌‌పై కర్మ మీడియా నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌పీ, నయనతార సొంత బ్యానర్  రౌడీ పిక్చర్స్‌‌‌‌, ఆల్ట్రా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.