- మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య
- ఆస్పత్రిలో మరియమ్మ కుటుంబ సభ్యులకు పరామర్శ
ఖమ్మం, వెలుగు: మరియమ్మ మృతి కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేస్తున్నామని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కొడుకు ఉదయ్ కిరణ్ ను బుధవారం హెచ్ఆర్సీ బృందం జిల్లా కలెక్టర్ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్తో కలిసి పరామర్శించారు. ఉదయ్కిరణ్కు అందిస్తున్న చికిత్స వివరాలపై డాక్టర్లతో మాట్లాడారు. మరియమ్మ మృతి ఘటన దురదృష్టకరమని, ఇలాంటివి పునరావృతం కాకుండా కమిషన్తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కోల్పోయిన ప్రాణాలను తిరిగి తేలేమని, ఆపదలో ఉన్నవారికి మనోధైర్యం కల్పించేందుకు తాము వచ్చినట్టు చెప్పారు. ఉదయ్కిరణ్పూర్తిగా కోలుకున్న తర్వాత కేసు విచారణను వేగవంతంగా కొనసాగించి కమిషన్ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తర్వాత జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో హెచ్ఆర్సీ బృందం పర్యటించింది. ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, సిబ్బందిని అభినందించారు. అనంతరం నగరంలోని జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెచ్ఆర్సీ బృందానికి పలువురు వినతిపత్రాలు అందజేశారు. భూ సమస్యలకు సంబంధించి హెచ్ఆర్సీ పలు ఆదేశాలు ఇచ్చినా వాటిని జిల్లా అధికారులు అమలు చేయడం లేదంటూ తెలంగాణ జనవేదిక ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. హార్వెస్ట్ స్కూల్సమీపంలో ఎన్ఎస్పీ భూముల్లో పేదల ఇండ్లను బలవంతంగా పోలీసులు ఖాళీ చేయించారంటూ ఫిర్యాదు చేశారు.