- అర్ధరాత్రి 3 గంటల వరకు రైళ్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు : కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని అర్ధరాత్రి వేళ ఇంటికి ఎలా వెళ్లాలా అని ఆలోచించే వారికి రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబరు 31 అర్ధరాత్రి 2.55 గంటల వరకు ఎంఎంటీఎస్సర్వీసులు నడపనున్నట్టు ప్రకటించారు. ఆ రోజు లింగంపల్లి టు ఫలక్నుమా రైలు 1.30 గం.లకు స్టార్టయి 2.55కు ఫలక్నుమా చేరుకుంటుంది.
లింగంపల్లి టు నాంపల్లి రైలు 1.15కు ప్రారంభమై 1.55కు నాంపల్లికి చేరుకుంటుంది. ఈ సమయాల్లో హఫీజ్పేట, హైటెక్సిటీ, బోరబండ, భరత్నగర్, ఫతేనగర్, నేచర్క్యూర్హాస్పిటల్, బేగంపేట, నెక్లెస్రోడ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్తదితర ప్రాంతాల నుంచి అర్ధరాత్రి వరకూ రైళ్ల రాకపోకలు ఉంటాయని తెలిపారు.
