నీ కడుపులో బిడ్డ చనిపోయిందన్న ప్రభుత్వ ఆస్పత్రి : ప్రైవేట్ ఆస్పత్రిలో పండటి బిడ్డకు జన్మ..

నీ కడుపులో బిడ్డ చనిపోయిందన్న ప్రభుత్వ ఆస్పత్రి : ప్రైవేట్ ఆస్పత్రిలో పండటి బిడ్డకు జన్మ..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం..మనదేశంలో పెద్ద సమస్య..ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఖర్చులు పెట్టలేక ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించిన పేదల ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతోంది. కొన్నికొన్ని సార్లు ప్రాణాలు పోతున్నాయి.వైద్యుల నిర్లక్ష్యంపై పేపర్లు, ఛానెళ్లు, సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒకచోట వార్తా కథనాలు చూస్తూనే ఉన్నాం..తాజాగా జార్ఖండ్ హజారీబాగ్లో వైద్యం నిర్లక్ష్యంపై కేసు, ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..   

జార్ఖండ్ హజారీబాగ్‌లోని షేక్ భిఖారీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (SBMCH)లో ఓ గర్భిణికి తప్పుడు రిపోర్టు, ఆ తర్వాత వైద్యం నిరాకరణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పాత హిమోగ్లోబిన్ రిపోర్టు చూపించడం, ఆస్పత్రిలో చేర్చుకోకపోవడం గర్బిణీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కడుపులో పిండం చనిపోయిందని చెప్పిగర్బిణీని ఆందోళనకు గురి చేశారు.  

ఆసుపత్రిలోని నర్సులు గర్భిణిని చేర్చుకోకుండా ఆమె కడుపులోని పిండం చనిపోయిందని పాత హిమోగ్లోబిన్ రిపోర్ట్‌ను చూపి చెప్పారట. దీంతో ఆందోళన చెందిన ఆమె భర్త ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. 

ఆసుపత్రి సిబ్బంది నిరాకరించడంతో ఆ దంపతులు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ సి-సెక్షన్ సర్జరీ చేయగా ఆమె ఆరోగ్యకరమైన 4 కిలోల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై దుమారం రేగడంతో చివరికి SBMCHఆస్పత్రి నర్సులను నిలదీయగా తప్పును ఒప్పుకున్నారు. హజారీబాగ్ డిప్యూటీ కమిషనర్ శశి ప్రకాష్ సింగ్ ఈ సంఘటనపై స్పందించి తక్షణమే విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి, నివేదికను అందించాలని SBMCH సూపరింటెండెంట్ డాక్టర్ అనుకరణ పూర్తీని ఆదేశించారు. దోషులపై చర్యలు తీసుకుంటామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రి యాజమాన్యం చూసుకోవాలని సూచించారు.

ఈ సంఘటన తీవ్ర ఆగ్రహాన్ని, రాజకీయ అలజడిని సృష్టించింది. విచారణ జరుగుతోంది. దోషులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.