ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన కరోనా

ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన కరోనా

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని వారాలుగా పైపైకి చేరుతూ వచ్చిన పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా మంగళవారం రోజువారీ టెస్టుల పాజిటివ్ రేటు 6.89% శాతానికి చేరుకుంది. గడచిన 24 గంటల్లో 4 వేల 482 పాజిటివ్ కేసులు నమోదు కాగా 265 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 14 లక్షల 2 వేల 873 మందికి చేరింది. ఇప్పటి వరకు 13 లక్షల 29వేల 899 మంది కొలుకోగా 22వేల 111 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేల 863 ఉంది.