యాదాద్రి కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగులకు విశ్రాంతి గది

యాదాద్రి కలెక్టరేట్‌లో మహిళా ఉద్యోగులకు విశ్రాంతి గది

యాదాద్రి, వెలుగు: యాదాద్రి కలెక్టరేట్​లో మహిళా ఉద్యోగుల కోసం విశ్రాంతి గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ ఎన్నికల సామగ్రి భద్రపరచడానికి ఉపయోగించిన గదిని మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా కేటాయించారు. లంచ్​తో పాటు విశ్రాంతి తీసుకోవడానికి ఈ గదిని ఉపయోగించుకోనున్నారు. 

ఈ గదిని కలెక్టర్​హనుమంతరావు ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ఏ. భాస్కరరావు, డీఆర్​వో జయమ్మ, డీసీఎస్​వో  రోజా, డీపీఆర్​వో అరుంధతి, వివిధ డిపార్ట్​మెంట్లకు చెందిన ఉద్యోగులు ఉన్నారు.