- క్రిస్టియన్ నేతలతో దీపాదాస్ మున్షి
హైదరాబాద్, వెలుగు : పార్లమెంట్ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని క్రిస్టియన్ నేతలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి కోరారు. దేశం ప్రమాదంలో ఉందని, కాంగ్రెస్ పార్టీని గెలిపించి దేశాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సికింద్రాబాద్లోని ఓ హోటల్లో నిర్వహించిన క్రిస్టియన్ మైనారిటీ నేతల సమావేశానికి ఆమె హాజరై, మాట్లాడారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన బిషప్లు, పాస్టర్లు పాల్గొన్నారు. దేశంలో సెక్యులర్ పార్టీ అవసరం ఉన్నదని, అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని కేంద్రం రాజకీయ ఎజెండాగా చేపడుతున్నదని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అయోధ్య వేడుకకు దూరంగా ఉన్నదని చెప్పారు.