కాంగ్రెస్​ను గెలిపించి దేశాన్ని కాపాడండి : దీపాదాస్​ మున్షి

కాంగ్రెస్​ను గెలిపించి దేశాన్ని కాపాడండి : దీపాదాస్​ మున్షి
  •     క్రిస్టియన్​ నేతలతో దీపాదాస్​ మున్షి

హైదరాబాద్, వెలుగు :  పార్లమెంట్​ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని క్రిస్టియన్​ నేతలను కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్​ మున్షి కోరారు. దేశం ప్రమాదంలో ఉందని, కాంగ్రెస్​ పార్టీని గెలిపించి దేశాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సికింద్రాబాద్​లోని ఓ హోటల్​లో నిర్వహించిన క్రిస్టియన్  మైనారిటీ నేతల సమావేశానికి ఆమె హాజరై, మాట్లాడారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్​ నియోజకవర్గాలకు చెందిన బిషప్​లు, పాస్టర్లు పాల్గొన్నారు. దేశంలో సెక్యులర్​ పార్టీ అవసరం ఉన్నదని, అది కాంగ్రెస్​ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని కేంద్రం రాజకీయ ఎజెండాగా చేపడుతున్నదని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్​ పార్టీ అయోధ్య వేడుకకు దూరంగా ఉన్నదని చెప్పారు.