
భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి మళ్లీ బరిలో దిగింది. గత నెలలో పండంటి అమ్మాయికి జన్మనిచ్చిన దీపిక, 20 రోజులు గడవక ముందే విల్లు పట్టింది. రేపటి నుంచి కోల్ కతాలో జరిగే నేషనల్ సీనియర్ ఓపెన్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు సిద్ధమైంది. 3సార్లు ఒలింపిక్స్ లో పాల్గొన్న దీపిక.. కోల్ కతాలో జరిగే ట్రయల్స్ లో పాల్గొనకపోతే ఈ ఏడాదంతా జట్టుకు దూరం కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ప్యారిస్ 2024 ఒలింపిక్స్ లో పాల్గొనడంపై ప్రభావం ఉంటుంది. అందుకే ఈ ట్రయల్స్ లో పాల్గోనేందుకు దీపిక సిద్ధమైంది.