
దక్షణాఫ్రికా గడ్డపై జరుగుతోన్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో టీమిండియా నిన్న రెండో విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్ దీప్తి శర్మ రికార్డు సృష్టించింది. భారత్ తరఫున టీ20ల్లో 100 వికెట్లు తీసిన ఏకైక(మెన్/ఉమెన్) బౌలర్ గా నిలిచింది. ఈ జాబితాలో తర్వాతి స్థానంలో పూనమ్ యాదవ్ (98 వికెట్లు), యుజేంద్ర చాహల్ (91 వికెట్లు) భువనేశ్వర్ (90 వికెట్లు) ఉన్నారు. విండీస్ తో జరిగిన మ్యాచ్ లో దీప్తి 3 వికెట్లు తీసి ఈ రికార్డు నెలకొల్పింది.