హెలికాఫ్టర్ ప్రమాదంపై రాజ్ నాథ్ సింగ్ ప్రకటన

హెలికాఫ్టర్ ప్రమాదంపై రాజ్ నాథ్ సింగ్ ప్రకటన

హెలికాప్టర్ ప్రమాద ఘటనపై లోక్ సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు.ఈ దుర్ఘటనలో 13 మంది దుర్మరణం చెందారన్నారు. అందరి మృతదేహాల్ని ఇవాళ సాయంత్రం ఢిల్లీకి తీసుకురానున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు. విచారణ కూడా ప్రారంభం అయ్యిందన్నారు రాజ్ నాథ్. చనిపోయిన వారికి, వారి కుటుంబాలకు దేశ ప్రజలందరి తరపున తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. గాయపడ్డవారిని వెల్లింగ్టన్ సహాయక బృందాలు ఆస్పత్రికి తరలించాయన్నారు. హెలికాఫ్టర్ కూలిపోవడాన్ని స్థానికులు ముందుగా గుర్తించారన్నారు.  ప్రమాదంలో గాయపడ్డ అధికారి లైఫ్ సపోర్ట్ పై చికిత్స పొందుతున్నట్లుగా కేంద్రమంత్రి తెలిపారు. ఆయన త్వరగా కోలుకునేందుకు అన్ని విధాల కృషి చేస్తామన్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.