WPL 2024: ఓటమి బాధే లేదు: సెలెబ్రేషన్‌లో మునిగిపోయిన ఢిల్లీ

WPL 2024: ఓటమి బాధే లేదు: సెలెబ్రేషన్‌లో మునిగిపోయిన ఢిల్లీ

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టును చోకర్స్ అంటుంటారు. స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఒక్క టైటిల్ గెలవలేకపోయింది. అయితే ఈ  సెంటి మెంట్ ను బ్రేక్ చేస్తూ నిన్న (మార్చి 17) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించి తొలిసారి టైటిల్ ను ముద్దాడింది. మెన్స్ సాధించని ఘనత ఉమెన్స్ సాధించడంతో ఫ్యాన్స్ కు కాస్త ఓదార్పు దక్కింది. ఈ మ్యాచ్ తర్వాత అందరూ ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ జట్టు మాత్రం సెలబ్రేషన్ చేసుకుంటూ కనిపించింది. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ గెలవడంతో ఢిల్లీ ఆటగాళ్లలో పెద్దగా బాధ కనిపించలేదు. కెప్టెన్ మెగ్ లానింగ్ కన్నీళ్లు పెట్టుకోవడం మినహాయిస్తే అందరూ ఓటమిని చాలా లైట్ తీసుకున్నట్టు అర్ధమవుతుంది. ఓడిపోయినా అందరూ కలిసి చిల్ అవుతూ డిన్నర్ చేస్తూ కనిపించారు. అందరూ నవ్వుకుంటూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఏదో గెలుపును ఎంజాయ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ALSO READ :- Kalyan Krishna: అసిస్టెంట్ డైరెక్టర్స్ పడే స్ట్రగుల్స్..ఎలా ఉంటాయో చెప్పిన డైరెక్టర్

గెలుపు బాధ కొంచమైనా లేదంటూ కొంతమంది నెటిజన్స్ స్పందిస్తుంటే.. ఓడిపోయినా ధైర్యంగా ఉన్నారని కొంతమంది వీరిని ప్రోత్సహిస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఢిల్లీకి వరుసగా ఇది రెండో ఫైనల్ ఓటమి. 2023 సీజన్ లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. నిన్న జరిగిన ఫైనల్లో మొదటి 6 ఓవర్లకు 61 పరుగులు చేసినా.. ఆ తర్వాత కేవలం 52 పరుగుల వ్యవధిలో చివరి 10 వికెట్లను కోల్పోయి చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. ఈ మ్యాచ్ లో టాస్‌‌‌‌‌‌‌‌ గెలిచిన ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. తర్వాత బెంగళూరు 19.3 ఓవర్లలో 115/2 స్కోరు చేసి గెలిచింది.