గవర్నమెంట్ ఆఫీసుల్లో రాజకీయనాయకుల ఫొటొలు ఉండవు

గవర్నమెంట్ ఆఫీసుల్లో రాజకీయనాయకుల ఫొటొలు ఉండవు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం, ఇతర రాజకీయ నాయకుల ఫొటోలు పెట్టమని ప్రకటించారు. గవర్నమెంటు ఆఫీసుల్లో కేవలం అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవాన్నిపురస్కరించుకొని ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించాలన్న అంబేద్కర్ కల నిజం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే గడిచిన ఏడేళ్లలో విద్యావ్యవస్థలలో అనేక సంస్కరణలు చేపట్టామని అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియో ట్రంప్ తమ స్కూళ్లను విజిట్ చేసిన విషయాన్ని కేజ్రీవాల్ గుర్తు చేశారు.