తీర్పు చెప్పిన 6 నెలలకు అప్పీల్ చేస్తరా?

తీర్పు చెప్పిన 6 నెలలకు అప్పీల్ చేస్తరా?

న్యూఢిల్లీ: బాలీవుడ్‌‌‌‌‌‌‌‌నటి జూహీచావ్లాపై ఢిల్లీ హైకోర్టు  మండిపడింది. 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ఆర్నెళ్ల క్రితం ఆమె పిటిషన్ వేయగా.. దాన్ని ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ గత జూన్​లో కొట్టేసింది. దాంతో పాటు ఫైన్​ విధించింది. ఇన్నాళ్ల తర్వాత ఆ తీర్పును సవాల్‌‌‌‌‌‌‌‌ చేస్తూ జుహీ తాజాగా అప్పీల్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. అయితే తీర్పుపై ఇంత లేట్​గా అప్పీల్‌‌‌‌‌‌‌‌ చేయడంపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ విపిన్‌‌‌‌‌‌‌‌ సంఘీ అసహనం వ్యక్తం చేశారు. జూన్‌‌‌‌‌‌‌‌లో తీర్పు వెలువరించాం. ఆరు నెలల తర్వాత ఇప్పుడు వచ్చారా? అని సీరియస్ అయ్యారు. ఆ తర్వాత అప్పీల్‌‌‌‌‌‌‌‌ను స్వీకరించారు. ప్రస్తుతం పలు పిటిషన్లు పెండింగ్​లో ఉన్నందున వచ్చే ఏడాది జనవరిలో విచారణ చేపడతామని జడ్జి వెల్లడించారు.