ఢిల్లీ లిక్కర్ స్కాం :  బెయిల్ పిటిషన్ వేసిన శరత్ చంద్రారెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాం :  బెయిల్ పిటిషన్ వేసిన శరత్ చంద్రారెడ్డి

ఢిల్లీ లిక్కర్ స్కాంలో వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న బినోయ్ బాబు, శరద్ చంద్రారెడ్డి జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగిసింది. దీంతో వారిద్దరిని ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ సెలవులో ఉన్నందున.. ఇద్దరిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరో జడ్జి వికాస్ ధుల్ ఎదుట ప్రవేశపెట్టారు. శరత్ చంద్రారెడ్డిపై విచారణ పెండింగ్‌లో ఉందని, ఆయనపై ఇంకా చార్జిషీట్ దాఖలు చేయలేదని కోర్టుకు ఈడీ  తెలిపింది.

వాదనలు విన్న న్యాయమూర్తి.. బినోయ్‌బాబు, శరత్ చంద్రారెడ్డిల జ్యుడీషియల్‌ కస్టడీ గడువును డిసెంబర్‌ 19 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 13న మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో కేసు తదుపరి విచారణ జరుగుతుందని తెలిపారు.