ఆప్కు బిగ్ షాక్.. మంత్రి రాజ్కుమార్ రాజీనామా

ఆప్కు బిగ్ షాక్.. మంత్రి రాజ్కుమార్ రాజీనామా

లోక్ సభ ఎన్నికల వేళ ఆమ్ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ప్రస్తుతం కేబినెట్ లో సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి రాజీనామా చేశారు. ఆప్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అవినీతిపై పోరాడేందుకు ఆప్ పుట్టింది కానీ..ఇప్పుడు అదే పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. అవినీతి పరులతో తాను ఉండలేనన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి ,పార్టీకి తాను దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాజ్ కుమార్ 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2022 నుంచి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. 

ఇప్పటికే లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. ఇదే కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై ఏప్రిల్ 10న ఉదయం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.