ఢిల్లీలో 29 నుంచి స్కూల్స్, కాలేజీలు రీఓపెన్

ఢిల్లీలో 29 నుంచి స్కూల్స్, కాలేజీలు రీఓపెన్

ఢిల్లీలో కాలుష్యం తగ్గి... ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుండడంతో... స్కూళ్లు, విద్యాసంస్థలు తెరవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 29 నుంచి విద్యా సంస్థలు ఓపెన్ చేయనున్నట్టు ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. 27 నుంచి ఢిల్లీలోకి CNG, ఎలక్ట్రిక్ వెహికిల్స్ అనుమతించనున్నట్టు తెలిపారు. 29 నుంచి గవర్నమెంట్ ఆఫీస్ లు కూడా సాధారణంగానే పనిచేస్తాయని చెప్పారు. ఎక్కువ మంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉండే కాలనీలకు స్పెషల్ బస్సులు నడుపుతామన్నారు.