ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ వెహికల్స్ బ్యాన్.. నవంబర్ 1 నుంచి అమల్లోకి

ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ వెహికల్స్ బ్యాన్.. నవంబర్ 1 నుంచి అమల్లోకి

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య అవసరాలకు నడిచే పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వాయు కాలుష్య ఉపశమన ప్రణాళిక–2025ని ప్రకటించారు. ఢిల్లీలోకి నవంబర్1వ తేదీ నుంచి కొత్త పెట్రోల్, డీజిల్ వాహనాలను అనుమతించరు. ఢిల్లీతో పాటు గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ లోనూ నిషేధం కొనసాగనుంది. 

ఈ మేరకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ ఈ నిబంధనను తప్పనిసరి చేస్తూ... క్యాబ్ అగ్రిగేటర్లు, డెలివరీ కంపెనీలు, ఈ కామర్స్ సంస్థలకు సమాచారం ఇచ్చింది. ఇది లైట్ కమర్షియల్, లైట్ గూడ్స్ వెహికల్స్, డెలివరీల కోసం వాడే టూ వీలర్లకు వర్తిస్తుంది.