కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ డెల్టా వేరియంట్ సోకే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(NCDC) వేర్వేరుగా జరిపిన పరిశోధనలో స్పష్టమైంది. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా కన్ఫాం చేయాల్సి ఉంది.
బ్రిటన్లో బయట పడిన ఆల్ఫా వేరియంట్తో పోలిస్తే ..భారత్లో గుర్తించిన డెల్టా రకానికి వ్యాపించే శక్తి 40-50 శాతం అధికమని ఇప్పటికే పలు అధ్యయనాలు తెలిపాయి. లేటెస్టుగా ఎయిమ్స్ అధ్యయనం కూడా అదే విషయాన్ని తెలిపింది. వరుసగా ఐదు రోజుల పాటు తీవ్ర జ్వరంతో ఎమర్జెన్సీ వార్డులో చేరిన 63 మంది కరోనా బాధితుల వివరాల్ని అధ్యయనం చేసి ఎయిమ్స్-ఐజీఐబీ ఈ విషయాలను తెలిపింది.
63 మందిలో 53 మంది కొవాగ్జిన్ మొదటి డోసు, మిగిలిన వారు కొవిషీల్డ్ ఫస్ట్ డోసు తీసుకున్నారు. మరో 36 మందికి ఏదేని ఒక టీకా రెండు డోసులు తీసుకున్నారు. ఒకే డోసు తీసుకున్న వారిలో 76.9% డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్ను గుర్తించారు. రెండు డోసులు తీసుకున్న వారిలో 60 శాతం ఇన్ఫెక్షన్ను గుర్తించారు.