జీపీ కార్మికులకు సెలవులు ఇవ్వాలని డిమాండ్

జీపీ కార్మికులకు సెలవులు ఇవ్వాలని డిమాండ్

కొల్లాపూర్, వెలుగు : పెంట్లవెల్లి  గ్రామ పంచాయతీ కార్మికులకు సెలవులు ఇవ్వాలని, వారి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్​ డిమాండ్​ చేశారు. కార్మికులతో కలిసి గురువారం ఎంపీడీవో రామయ్యకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల బంధువులు చనిపోయినా సెలవులు ఇవ్వడం లేదని, డ్యూటీకి రాకుంటే వేతనాలు కట్ చేయడం సరైంది కాదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోగా, అరకొర వేతనాన్ని కట్  చేయడమేమిటని ప్రశ్నించారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కుర్మయ్య, కార్మికులు శ్రీనివాసులు, లక్ష్మి, అంబులమ్మ, చెన్నమ్మ, దేవమ్మ, కలమూరు దేవమ్మ పాల్గొన్నారు.