ఇంటి టాక్స్   తగ్గించాలని ధర్నా : ఆమనగల్లు

ఇంటి టాక్స్   తగ్గించాలని ధర్నా : ఆమనగల్లు

ఆమనగల్లు, వెలుగు : మున్సిపాలిటీలో పెంచిన ఇంటి ట్యాక్స్ ను తగ్గించాలని, ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్  చేస్తూ మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్  ఆఫీస్​ ఎదుట ధర్నా నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి హైవేపై సీఎం కేసీఆర్  దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ పెంచిన ఇంటి ట్యాక్స్ తో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

అనంతరం కమిషనర్  శ్యాంసుందర్ కు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్  చైర్మన్  రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు విజయకృష్ణ, లక్ష్మణ్, చెన్నకేశవులు, యాదమ్మ శ్రీశైలం యాదవ్, నాయకులు హరిప్రసాద్, శ్రీకాంత్ సింగ్, నరసింహ, ఆనంద్  పాల్గొన్నారు.