గత కొద్దిరోజులుగా చలి వణికిస్తోంది. ఈక్రమంలో పొగమంచు కూడా దట్టంగా కమ్ముకుంటోంది. శుక్రవారం ఉదయం కరీంనగర్లో పొగమంచు కప్పేసింది. కేబుల్ బ్రిడ్జి, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్, తెలంగాణ చౌక్ మంచు దుప్పట్లోకి పోయింది. ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించక వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్
