గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ భూముల కబ్జాలు ఇవీ..!

గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ భూముల కబ్జాలు ఇవీ..!

తెలంగాణలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించేందుకు సర్కారు చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విలువైన గవర్నమెంట్​ ల్యాండ్స్​ను సర్వే చేసి జియో ట్యాగ్ చేయాలని.. వాటి చుట్టూ ఫెన్సింగ్ (ప్రహరీగోడ) నిర్మించాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది

ఆ మూడు జిల్లాల్లో భారీగా కబ్జాలు  

రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజ్​గిరి, సంగారెడ్డి వంటి జిల్లాల్లో కబ్జాల సమస్య తీవ్రంగా ఉంది. పట్టణీకరణ వేగవంతం కావడంతో, ఈ జిల్లాల్లోని భూముల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అక్రమార్కులు ప్రభుత్వ భూములను లక్ష్యంగా చేసుకొని, వందల ఎకరాలను కబ్జా చేశారు. ప్రభుత్వానికి చెందిన పోరంబోకు, వాగులు, చెరువులు, ఖాళీ స్థలాలు ఇలా ఏది దొరికితే దాన్ని కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చి అమ్మేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నది. రియల్ ఎస్టేట్ విలువలు గణనీయంగా పెరగడంతో ప్రభుత్వ భూముల కబ్జాలు తీవ్రమయ్యాయి. ఈ జిల్లాల్లో కోట్ల రూపాయల విలువ చేసే వేల ఎకరాల గవర్నమెంట్​ ల్యాండ్స్​ ఉన్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల అవినీతి వల్ల ఈ భూముల్లో వందల ఎకరాలు ఇప్పటికే కబ్జాకు గురయ్యాయి. నకిలీ పత్రాలు సృష్టించడం, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయడం, లేదా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ద్వారా కబ్జాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్​ భూములు కాకుండా వివిధ రకాల ప్రభుత్వ భూములు 16 లక్షల ఎకరాలు పైనే ఉన్నాయి. ఈ లెక్కలపైన కూడా స్పష్టత లేదు. 

కొన్ని చోట్ల ప్రభుత్వ భూముల కబ్జాలు ఇవీ..!

రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామ పరిధిలో సుమారు 60 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలు సృష్టించి, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. ఈ భూమిని ప్లాట్లుగా మార్చి అమ్మకాలు కూడా చేపట్టారు. నకిలీ పత్రాలను గుర్తించిన ప్రభుత్వం.. ఈ భూములను స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను  ఇటీవల కూల్చివేసింది. ఈ భూమి విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శాతమ్రాయి గ్రామంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్టుకు చెందిన 11 ఎకరాల భూములను స్థానిక రియల్టర్ కంపెనీ (అనీష్ కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్స్), రాజకీయ నాయకుడు కలిసి కబ్జా చేసి, అసఫ్ జాహీ వారసుల నుంచి కొనుగోలు చేసినట్టు తప్పుడు డాక్యుమెంట్లు చూపించారు. ఇటీవల ప్రభుత్వం స్థానికుల ఫిర్యాదులతో అక్కడ తాత్కాలిక నిర్మాణాలను తొలగించి.. తిరిగి స్వాధీనం చేసుకున్నది.

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో 6 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాలకు గురైంది. చివరికి స్థానికులు కోర్టుకు వెళ్లడంతో.. రక్షించాలని రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించింది.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెట్ పరిధిలోని ప్రభుత్వ భూములను, ముఖ్యంగా దక్కన్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (దిల్​)కు చెందిన భూములను ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కూడా వేయడానికి ప్రయత్నించారు. ఈ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ ల్యాండ్స్​ చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించి, హద్దులను స్పష్టంగా గుర్తించేందుకు చర్యలు చేపట్టింది.

మేడ్చల్ జిల్లాలోని ప్రసిద్ధ కీసరగుట్ట శివాలయం, శామీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలోని నరసింహస్వామి ఆలయానికి చెందిన వందల ఎకరాల దేవాదాయ భూములు కబ్జా అయ్యాయి. ఈ భూములను నకిలీ రిజిస్ట్రేషన్లు, నకిలీ పట్టాలతో ప్రైవేట్ వ్యక్తులు తమ పేరు మీద మార్చుకున్నారు. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా ఈ భూములపై సర్వే నిర్వహిస్తున్నాయి. నకిలీ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి.. భూములను ఆలయాలకు అప్పగించేందుకు చర్యలు చేపట్టాయి.