ముషీరాబాద్, వెలుగు: మత్స్యకారులు, మత్స్య సహకార సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సమైక్య చైర్మన్ మెట్టు సాయికుమార్ చెప్పారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన వెంటనే మత్స్య పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గురువారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గంగపుత్ర చైతన్య సమితి తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో మెట్టు సాయికుమార్ కు అభినందన సత్కార సభ నిర్వహించారు. చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు మంగలిపల్లి శంకర్ మాట్లాడుతూ.. అటవీ సంపదపై స్థానికులకు ఏవిధమైన హక్కులు ఉంటాయో.. సంప్రదాయ మత్స్యకారులకు చేపల వేట, అమ్మకం, కులవృత్తిపై పూర్తి హక్కులు కల్పించాలని కోరారు. అందుకోసం ప్రత్యేక చట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యశాఖ ఉద్యోగాల్లో 40% వాటా కల్పించాలని, గంగపుత్ర కార్పొరేషన్కు రూ.2వేల కోట్లు కేటాయించాలని, ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కొప్పు పద్మ, సత్యనారాయణ, నరసయ్య, ప్రవీణ్, పరమేశ్వర్, సురేశ్, సుమిత్ర, రచ్చ ఎల్లయ్య, దయానంద్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేస్తం : మెట్టు సాయికుమార్
- హైదరాబాద్
- April 12, 2024
లేటెస్ట్
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- 2 లక్షల రుణమాఫీ చేసి.. మీ రుణం తీర్చుకుంటా: సీఎం రేవంత్ రెడ్డి
- కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- Sobhita Dhulipala: చై అన్నారా.. చాయ్ అన్నారా.. శోభిత లేటెస్ట్ పోస్ట్ మీనింగ్ ఏంటో?
- Historic Nomination: దక్షిణ ఢిల్లీ నుంచి థర్డ్ జెండర్ అభ్యర్థి నామినేషన్
- Vijay Devarakonda: అధికారిక ప్రకటన వచ్చేసింది.. పాన్ ఇండియా లెవల్లో విజయ్ భారీ సినిమా
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- కాంగ్రెస్ ప్రభుత్వంపై అరవింద్ సంచలన వ్యాఖ్యలు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి
Most Read News
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న