నేటి నుంచి ఏడుపాయల్లో దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలు

నేటి నుంచి ఏడుపాయల్లో  దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలు

పాపన్నపేట, వెలుగు: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల్లో నేటి నుంచి దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజులు జరిగే శరన్నవ రాత్రి ఉత్సవాలకు తెలంగాణతో పాటు మహరాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు తరలివస్తారు. అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తారు.

మొదటి రోజు శైలపుత్రి(బాలాత్రిపురసుందరి), రెండో రోజు బ్రహ్మచారిణి(గాయత్రీదేవి), మూడో రోజు చంద్రఘంట (అన్నపూర్ణ), నాలుగో రోజు కుష్మాండ(వనదుర్గ), ఐదో రోజు స్కందమాత (మహలక్ష్మీ), ఆరో రోజు కాత్యాయని (సరస్వతి), ఏడో రోజు కాలరాత్రి (దుర్గాదేవి), ఎనిమిదో రోజు మహగౌరి,(మహిషాసురమర్ధిని), తొమ్మిదో రోజు రాజరాజేశ్వరి రూపల్లో భక్తులకు దర్శనమిస్తుంది.