ఖైరాతాబాద్ గణేషుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు 

ఖైరాతాబాద్ గణేషుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు 

హైదరాబాద్:  ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం కోసం భక్తుల బారులు తీరారు. ఆదివారం సెలవు దినం కావడంతో కుటుంబసమేతంగా ఖైరతాబాద్‌ వినాయకుడి వద్దకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. పంచముఖ రుద్ర మహాగణపతి దర్శనానికి వీఐపీల తాకిడి పెరిగింది. దీంతో ఖైరతాబాద్‌ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భక్తులు సొంత వాహనాల్లో రావద్దని ట్రాఫిక్‌ పోలీసుల విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్‌ ప్రధాన మార్గంలో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. హెచ్‌ఎండీఏ పార్కింగ్‌ స్థలంలో వాహనాల పార్కింగ్‌కు అనుమతినిచ్చారు. వృద్ధులు, నడవలేని వారికి మింట్‌ కాంపౌండ్‌లో పార్కింగ్‌కు పోలీసులు అనుమతిస్తున్నారు.