జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులుతీరారు. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. గణపతి పూజ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించారు.