శ్రీశైలం బ్రహ్మోత్సవాలు..వైభవంగా రథోత్సవం

శ్రీశైలం బ్రహ్మోత్సవాలు..వైభవంగా రథోత్సవం

ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. క్షేత్ర పురవిధుల్లో  శ్రీస్వామి అమ్మవారి రధోత్సవం కన్నుల పండుగగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో   భాగంగా సోమవారం శ్రీస్వామి అమ్మవారికి రధోత్సవం శోభాయమానంగా జరుగింది. రథోత్సవంపై  భక్తులకు దర్శనమిచ్చారు  ఆది దంపతులు .  రథోత్సవానికి  వేలాదిమంది భక్తులు  తరలివచ్చారు. శివనామస్మరణతో మారుమోగాయి  శ్రీగిరులు. 

ఫిబ్రవరి 8 నుంచి జరుగుతోన్న ఈ బ్రహ్మోత్సవాల్లో  ఫిబ్రవరి 17న యాగ పూర్ణాహుతి, ధ్వజారోహణ, 18న అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.

ఆర్జిత సేవలు నిలిపివేత..

శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల18 వరకు అన్ని ఆర్జిత సేవలను నిలిపివేశారు. భక్తులకు స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. ఫిబ్రవరి 13 నుంచి 18 వరకు స్పర్శ దర్శనాలను పూర్తిగా నిలిపి వేశారు.