‘దర్జా’   మూవీ ప్రతి ఒక్కరిని అలరిస్తుంది

 ‘దర్జా’   మూవీ ప్రతి ఒక్కరిని అలరిస్తుంది

జులై 22న ‘దర్జా’  సినిమా రిలీజ్ కానున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న  ఈ మూవీని ఈ నెల ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సంబంధించి డేట్ అనౌన్స్‌మెంట్ లోగోని శనివారం, హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘గుడుంబా శంకర్’ దర్శకుడు వీరశంకర్, పాత్రికేయులు ప్రభు, వినాయకరావులు సంయుక్తంగా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిత్రం నిర్మాత రవి పైడిపాటి దర్శకుడు వీరశంకర్‌గారికి, పాత్రికేయులు ప్రభు, వినాయకరావులకు ధన్యవాదాలు తెలిపాడు.

ఈ సందర్భంగా కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మాట్లాడుతూ...దర్జా సినిమా కోసం  ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది పెద్దలు సహకరించారన్నారు. తమ సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరాడు. సునీల్, అనసూయ, ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, పాల్ రామ్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు. 

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇతర విషయాలు...

కెమెరా: దర్శన్
సంగీతం: రాప్ రాక్ షకీల్
ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ
కథ: నజీర్
మాటలు: పి. రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: బందర్ బాబీ
స్ర్కిఫ్ట్ కో-ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ
పీఆర్ఓ: బి. వీరబాబు
కో & ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రవి పైడిపాటి
నిర్మాత: శివశంకర్ పైడిపాటి
స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సలీమ్ మాలిక్