ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా కు రెగ్యులర్ జిల్లా రవాణా శాఖ అధికారిగా ధర్మపురి జగదీశ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ ఇన్చార్జ్ రవాణా శాఖ అధికారిగా పని చేసిన వాకాదాని వెంకట రమణ ఇక నుంచి ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో నే ఎంవీఐ గా కొనసాగనున్నారు.
ఈ సందర్భంగా జిల్లాకు ఫస్ట్ పోస్టింగ్ గా వచ్చిన జగదీశ్ కు ఏఎంవీఐ, ఎంవీఐలు, సిబ్బది శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో డీటీఓ పోస్టును సాధించినట్లు తెలిపారు.
