గాంధీలో డాక్టర్ల ధర్నా.. ఓపీ బంద్

గాంధీలో డాక్టర్ల ధర్నా.. ఓపీ బంద్

సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్స్ ధర్నాకు దిగారు. సెంట్రల్ గవర్నమెంట్ నీట్ విద్యార్థులను త్వరగా రిక్రూట్ చేసుకోవాలని ఔట్ పేషంట్ విధులను బహిష్కరించారు. సూపరిండెంట్ మెయిన్ బ్లాక్ వద్ద జూనియర్ డాక్టర్లు ధర్నా చేస్తున్నారు. ఈ రోజు నుంచి మూడు రోజులు ఇలాగే నిరసన తెలుపనున్నట్లు జూనియర్ డాక్టర్స్ తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తే.. ఆస్పత్రిలో ఎలక్ట్రిక్ సేవలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించారు.