
కుభీర్, వెలుగు: టీచర్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ స్టూడెంట్లు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం నిగ్వా గవర్నమెంట్హైస్కూల్లో 200 మంది వరకు స్టూడెంట్లు ఉన్నారు. ప్రైమరీ స్కూల్లో ముగ్గురు టీచర్లు, హైస్కూల్లో ఐదుగురు టీచర్లు ఉన్నారు. తెలుగు మీడియం, సైన్స్టీచర్లు లేరు. టీచర్లు లేక చదువులో వెనకపడుతున్నామంటూ స్టూడెంట్లు మంగళవారం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
గతేడాది టెన్త్ క్లాస్లో వంద శాతం రిజల్ట్స్వచ్చాయని, కానీ టీచర్లు లేక ఈ ఏడాది ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పలుసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న అనుసూయ పవార్ ట్రస్ట్ చైర్మన్రామారావు పటేల్స్టూడెంట్లకు మద్దతు తెలిపారు. ఎంఈవో చంద్రకాంత్వచ్చి టీచర్లను త్వరలోనే నియమిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.