
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై గౌతమ్ గంభీర్ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గంభీర్... 2011 వరల్ట్ కప్ ఫైనల్ ని గుర్తుచేసుకుంటూ ధోనిపై కామెంట్స్ చేశాడు. ఫైనల్ మ్యాచ్లో తాను సెంచరీకి చేరువవుతుంటే ధోని తన దగ్గరకు వచ్చి గాబరా పడకుండా నెమ్మదిగా ఆడామని చెప్పాడని గంభీర్ తెలిపాడు.
గెలిచేది మనమేనని ఫైనల్లో సెంచరీ కంప్లీట్ చేసుకుంటే ఇది ప్రత్యేకంగా నిలుస్తుందని ధోనీ తనతో అన్నట్టుగా గంభీర్ వెల్లడించాడు. అయితే తానే అనుకోకుండా తప్పుడు షాట్ ఆడి సెంచరీ మిస్ చేసుకున్నట్లుగా గంభీర్ వివరించాడు. క్రీజ్లో ఉన్నంతసేపు ధోనీ తనకు చాలా సపోర్ట్గా నిలిచాడని ఈ సందర్భంగా గంభీర్ చెప్పుకొచ్చాడు.
కాగా ఈ మ్యాచ్లో నాల్గొవ వికెట్కు ధోనీతో కలిసి 109 పరుగులు జోడించిన గంభీర్... 97 పరుగుల వద్ద తిసారా పెరీరా చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక 91 పరుగులతో నాటౌట్ గా నిలిచిన ధోనీ ఇండియాకు 12 ఏళ్ల తర్వాత మళ్లీ వరల్ట్ కప్ ను సాధించి పెట్టాడు.