ధూల్‌పేట శ్రీరామ నవమి శోభాయాత్ర రద్దు

ధూల్‌పేట శ్రీరామ నవమి శోభాయాత్ర రద్దు
  • బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్

హైదరాబాద్: ప్రతి సంవత్సరం దూల్ పేటలో భారీగా నిర్వహించే శ్రీరామ నవమి శోభాయాత్రను ఈ ఏడాది రద్దు చేస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రకటించారు. ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ఈ శోభాయాత్రను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. నవమి రోజున కేవలం పూజా కార్యక్రమాలను మాత్రమే నిర్వహిస్తామని ఆయన వివరించారు. కరోనా కేసుల వ్యాప్తి తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని.. ఈ సంవత్సరం శోభాయాత్రను రద్దు చేస్తున్నాం కాబట్టి భక్తులు సహకరించాలని ఆయన కోరారు. దూల్ పేట్ లో శ్రీరామ నవమి శోభాయాత్ర వల్లనే కరోనా కేసులు పెరిగాయనే అపవాదు మనకు రావద్దని ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని.. అందరూ అర్థం చేసుకుని సహకరించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.