డైమండ్స్​ గిరాకీ తగ్గింది

డైమండ్స్​ గిరాకీ తగ్గింది
  • అమెరికా, చైనా కొనకపోవడమే కారణం
  • రఫ్​ డైమండ్స్​ ఆక్షన్స్​ వాయిదా
  • కొత్త మార్కెట్ల కోసం వేట

వెలుగు బిజినెస్​ డెస్క్​: మన డైమండ్​ కంపెనీలు భాగం పంచుకోలేమనడంతో  రఫ్​ డైమండ్​ ఆక్షన్స్​ను అక్కడి ఆక్షన్​ హౌస్​లు కాన్సిల్​చేశాయి. అంతేకాదు, గ్లోబల్​గా పేరొందిన డైమండ్​ మైనింగ్​ కంపెనీ డి బీర్స్​ కూడా తన ఆక్షన్స్​ను వాయిదా వేసింది. అమెరికా, చైనా దేశాలలో పాలిష్డ్​ డైమండ్స్​కు డిమాండ్​ పడిపోవడం వల్లే మన డైమండ్​ కంపెనీలు ఆక్షన్​లలో పాల్గొనడానికి ఇష్టపడటం లేదు. మన దేశపు కంపెనీలు పాల్గొనలేమని చెప్పడంతో బెల్జియం, దుబాయ్​ దేశాలలో ఆక్షన్ హౌస్​లు ఆక్షన్స్​ను ఆపేశాయని జెమ్​ అండ్​ జ్యుయెలరీ ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ కౌన్సిల్​ (జీజేఈపీసీ) చైర్మన్​ విపుల్​ షా చెప్పారు. గిరాకీ పెరిగితే తప్ప తాము పాల్గొనలేమని మన కంపెనీలు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.

పదింటిలో తొమ్మిది మనమే పాలిష్ చేస్తున్నం...

గ్లోబల్​ మార్కెట్లలో అమ్మే పాలిష్డ్​ డైమండ్స్​ ప్రతి పదింటిలో తొమ్మిదింటినీ మన దేశంలోని కంపెనీలే కట్​ చేసి పాలిష్​ చేస్తాయి. మార్కెట్లోని పరిస్థితులను విశ్లేషించిన తర్వాత ఆక్షన్స్​ను వాయిదా వేయడమే మేలని నిర్ణయించుకున్నట్లు డి బీర్స్​ గ్రూప్​ డైమండ్​ ట్రేడ్​ కంపెనీలకు సమాచారం పంపించింది. తన ఇంటరిమ్​, మెయిన్​ ఆక్షన్స్​ను ఇప్పుడు కలిపే నిర్వహించాలనే ఆలోచనకు వచ్చినట్లు పేర్కొంది. బల్క్​ బయ్యర్ల కోసం రఫ్​ డైమండ్స్​ చూపించే కార్యక్రమాన్ని కూడా పోస్ట్​పోన్​ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత తెలియచేస్తామని తెలిపింది. గ్లోబల్​ మార్కెట్లలో డైమండ్స్​కు గిరాకీ లేకపోవడంతో రఫ్​ డైమండ్స్​ రేట్లు 10 శాతం తగ్గిపోయాయి. మార్కెట్లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొందని, గిరాకీ తగ్గిపోయిందని, ఈ గిరాకీ ఎప్పుడు పెరుగుతుందో తెలియడం లేదని విపుల్​ షా అన్నారు. అమెరికా,  చైనా దేశాల మార్కెట్లే ప్రధానంగా ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. బాగా ఖరీదైన డైమండ్స్​ అమెరికాలో ఇప్పుడు కూడా అమ్ముడవుతున్నాయని, కానీ మిడ్​–సెగ్మెంట్​ డైమండ్స్​ మాత్రం అమ్ముడుపోవడం లేదని వివరించారు. ఇదే డిమాండ్​ను దెబ్బ తీస్తోందని పేర్కొన్నారు.

పాలిష్డ్​ డైమండ్స్​కు గిరాకీ తగ్గిన ప్రభావం ఈ క్వార్టర్లో మన ఎగుమతులపై పడుతుందని జీజేఈపీసీ చైర్మన్​ చెప్పారు. రెండో పెద్ద మార్కెట్టయిన చైనాలోనూ పరిస్థితులు ఆశావహంగా కనబడటం లేదన్నారు. రెండో క్వార్టర్​ దాకా వేచి చూడాల్సిందేనని పేర్కొన్నారు. అమెరికాలో డైమండ్స్​కు గిరాకీ పడిపోవడంతో ఇప్పుడు డైమండ్​ కంపెనీలు కెనడా మార్కెట్ వైపు చూస్తున్నాయి. కెనడాలోని గవర్నమెంట్​తో చర్చలు జరిపేందుకు మన దేశం నుంచి ఒక టీమ్​ బయలుదేరి వెళ్తోంది. కాంప్రహెన్సివ్​ ఎకనమిక్​ పార్ట్​నర్షిప్​ ఎగ్రిమెంట్​ (సీఈపీఏ) కుదుర్చుకునే దిశలో ఈ టీమ్​ ప్రయత్నాలు చేస్తోంది. కెనడా మార్కెట్లోకి అడుగు పెట్టడానికి ఇంకా కొంత టైము పడుతుందని, ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తున్నామని షా వెల్లడించారు. మార్చి 2023తో ముగిసిన ఫైనాన్షియల్​ ఇయర్లో మన దేశపు గ్రాస్​ ఎక్స్​పోర్ట్స్​ (కట్​, పాలిష్డ్​ డైమండ్స్​) 22,044 మిలియన్​ డాలర్లకు చేరాయి. అంతకు ముందు ఫైనాన్షియల్​ ఇయర్​లోని 24,433 మిలియన్​ డాలర్ల నుంచి ఈ ఎగుమతులు 9.78 శాతం తగ్గిపోయినట్లు.