రెండో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్?.. పోస్ట్ పెట్టింది సరే.. ఎందుకింత సీక్రెట్?

రెండో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్?.. పోస్ట్ పెట్టింది సరే.. ఎందుకింత సీక్రెట్?

టాలీవుడ్ బ్యూటీ ఇలియానా క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడలో పలు మూవీస్ చేసి స్టార్ డం సంపాదించుకుంది. ఇప్పుడీ ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది. 

ఇలియానా పోర్చుగీసుకి చెందిన వ్యాపార వేత్త మైఖేల్ డోలన్ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ జంటకి ఆగస్టు 2023 సంవత్సరంలో కొడుకు పుట్టాడు. ఇక ఇటీవల ఆమె రెండోసారి కూడా తల్లి కాబోతోందని వార్తలొచ్చాయి. అయితే, ఇటీవలే ఫాదర్స్ డే సందర్భంగా ఓ పోస్ట్ పెట్టి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది.

అందులో తన భర్త డోలన్.. పసికందును ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసింది. దానికి బెస్ట్ డాడీ అని క్యాప్షన్ ఇచ్చింది. రోజుల బిడ్డతో ఉన్న ఆ ఫోటో కనిపించడంతో నెటిజన్లు 'ఇలియానా రెండో బిడ్డకు జన్మనిచ్చిందా?" అని ప్రశ్నిస్తున్నారు.

మరి ఈ  విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సీక్రెట్ గానే ఉంచారు. అభిమానులు మాత్రం ఇలియానా అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలో మంచి రోజు చూసి చెబుతుందేమో చూడాలని? పోస్ట్ పెట్టింది సరే..ఎందుకింత సీక్రెట్ ఉంచుతుంది? అనౌన్స్ చేయొచ్చు కదా.. ? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇలియానా కెరీర్ వి షయానికి వస్తే. తెలుగుతో పాటు తమిళం, హిందీ. భాషల్లో నటించి తన మార్క్ వేసింది. ఇటీవల ఆమె 'దోబెర్ దో ప్కార్' అనే హిందీ చిత్రంలో కనిపించింది. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె 'రైడ్ 2' వంటి పెద్ద అవకాశాలను వదులుకోవాల్సి వచ్చింది.

చివరగా తెలుగులో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది. 2024లో "డో ఔర్ డో ప్యార్" అనే హిందీ మూవీలో నటించింది. షీర్షా గుహా ఠాకుర్తా తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ మూవీలో విద్యా బాలన్, ప్రతీక్ గాంధీ కీలక పాత్రల్లో కనిపించారు.ఆ తర్వాత సోషల్ మీడియాలో వరుస పోస్టులతోనే తెలుగు ప్రేక్షకులకు కనిపిస్తుంది. 

►ALSO READ | Samantha Viral Video: ఎక్కడ పడితే అక్కడ ఫొటోలు తీస్తారా: ఫొటోగ్రాఫర్పై సమంత ఆగ్రహం