పెట్రోల్‎తో పాటు డీజిల్ ధరలు పైపైకి.. వరుసగా ఐదో రోజు

పెట్రోల్‎తో పాటు డీజిల్ ధరలు పైపైకి.. వరుసగా ఐదో రోజు

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. శనివారం లీటర్ పెట్రోల్ పై 30 పైసలు పెంచగా.. డీజిల్ పై 35 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దేశంలోని పలు నగరాల్లో లీటర్ డీజిల్ ధర వంద దాటింది. ప్రస్తుతం ముంబైలో లీటర్ డీజిల్ ధర 100 రూపాయల 29 పైసలకు చేరింది. ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా లీటర్ డీజిల్ ధర 92 రూపాయల 47 పైసలకు పెరిగింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లీటర్ డీజిల్ వంద రూపాయలు దాటింది. 

పెట్రోల్ విషయానికొస్తే ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 103 రూపాయల 84 పైసలుగా ఉండగా.. ముంబైలో 109 రూపాయల 54 పైసలకు చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 107.41 పైసలుండగా.. డీజిల్ ధర 100.13 పైసలకు చేరింది.

For More News..

లఖీంపూర్ అప్డేట్: విచారణకు హాజరైన మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా

పిల్లి పోయిందని పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు