
జనగామ అర్బన్, వెలుగు: తెలంగాణ వ్యాప్తంగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఈ నెల 20 నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులతోపాటు షెడ్యూల్ను స్టేట్ఇన్స్టిట్యూట్ఆఫ్ఎడ్యుకేషన్ టెక్నాలజీ(ఎస్ఐఈటీ) డైరెక్టర్ శుక్రవారం విడుదల చేశారు. డిజిటల్తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని చర్యలను రాష్ట్రంలోని 31 జిల్లాల డీఈవోలు తీసుకోవాలని ఆదేశించారు. గవర్నమెంట్ స్కూల్స్లో డిజిటల్ తరగతుల నిర్వహణ కోసం టీసాట్(విద్యా) చానెల్ టీచర్స్, స్టూడెంట్స్కు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఎస్ఐఈటీ అధికారులు జూన్ నెలలో 9 రోజుల పాటు డిజిటల్తరగతులు నిర్వహించడానికి అవసరమైన టైం టేబుల్ప్రిపేర్ చేశారు. ప్రతిరోజు ఉదయం 10.40 నుంచి మధ్యాహ్నం 3.35 వరకు (మధ్యలో విరామం ఇస్తూ) 6,7,8,9,10 తరగతుల స్టూడెంట్లకు ఇంగ్లీష్, హిందీ, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్స్టడీస్ సబ్జెక్టులతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లను డిజిటల్ తరగతుల ద్వారా స్టూడెంట్స్కు చూపించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్స్కూళ్లకు దీటుగా డిజిటల్ క్లాస్లు మారుమోగనున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న స్టూడెంట్లు సబ్జెక్ట్ కంటెంట్అర్థం చేసుకోవడంతోపాటు ఎగ్జామ్స్లో ఉత్తమ ఫలితాలను సాధించే దిశగా అడుగులు వేయడానికి అవకాశం కలుగుతుంది.