
ప్రతి స్కూల్ కు 6, 7, 8 తరగతులకు ఒకటి చొప్పున 3 ట్యాబ్స్ పంపిణీ చేశారు. సదరు ట్రస్ట్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్ట్ లను విద్యార్థులకు సులభంగా అర్థం అయ్యేలా బోధించడం కోసం ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించింది. ఆ యాప్ ను ట్యాబ్ లలో ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. ట్యాబ్ ద్వారా ఆయా సబ్జెక్ట్ ల పాఠ్యాంశాలు బోధించడంపై టీచర్లకు శిక్షణ ఇచ్చారు. మూడు జిల్లాల్లో 100 స్కూళ్లలో చదువుతున్న 8 వేల మంది విద్యార్థులకు ట్యాబ్ ల ద్వారా పాఠాలను బోధిస్తున్నారు.
1,500 మంది విద్యార్థులకు..
ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో మరిన్ని స్కూళ్లకు విస్తరించాలని విద్యాశాఖ, మేఘశాల ట్రస్టు నిర్ణయించాయి. మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో 150 స్కూళ్లలో ట్యాబ్ ల ద్వారా పాఠాల బోధన విధానం అమలు చేయాలని నిర్ణయించారు. మెదక్ జిల్లాలో 60 స్కూళ్లను, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి 90 స్కూళ్లను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు మెదక్ జిల్లాలో ఎంపిక చేసిన స్కూళ్లకు మేఘ శాల ట్రస్ట్ ద్వారా ట్యాబ్ లను పంపిణీ చేశారు. మొదటి దశలో ట్యాబ్ ల ద్వారా మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్ట్ లను మాత్రమే బోధించగా ఈ సారి ఎంపిక చేసిన స్కూళ్లలో ఇంగ్లిష్ సబ్జెక్ట్ కూడా బోధించనున్నారు. అందుకు అనుగుణంగా సంబంధిత యాప్ ను అప్డేట్చేస్తున్నారు. రెండో దశలో మొత్తం 150 స్కూళ్లలో ట్యాబ్ ల ద్వారా పాఠాల బోధన అమలు కానుండగా సుమారు 1,500 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.