
తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ‘మిరాయ్’ చిత్రం సెప్టెంబర్ 12న విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా నిర్మాత దిల్ రాజు ‘మిరాయ్’ టీమ్ను అభినందించారు. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొని హీరో తేజ సజ్జా కోసం తమ ఇంట్లో ఆత్మీయ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తేజతోపాటు డైరెక్టర్ కార్తీక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ చిత్రం ఇప్పటికే వరల్డ్వైడ్గా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్ని దాటింది.